ప.గో, సూర్యాపేటలో కొత్త కేసుల నమోదు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో 3, ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య

Published : 14 Apr 2020 19:29 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో 3, ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు వెల్లడించాయి. సూర్యాపేటలో నమోదైన కేసుల్లో.. సూర్యాపేటలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇవాళ పరీక్షించిన 80 నమూనాల్లో 77 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. తాజగా నమోదైన 3 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 30కి చేరింది.

పశ్చిమగోదావరిలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 3, పెనుగొండలో ఒక కేసు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో 11కి, పెనుగొండలో 6కి కేసుల సంఖ్య చేరిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 973 రక్తనమూనాలు సేకరించగా వాటిలో 27 పాజిటివ్‌, 678 నెగటివ్‌ రాగా మరో 268 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని