ఆ లేఖ రాసింది నేనే:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

గతంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖ వివాదంపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై

Updated : 16 Apr 2020 14:29 IST

అమరావతి: గతంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖ వివాదంపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఆ లేఖ నేనే రాశా. ఎన్నికల కమిషనర్‌గా నాకున్న అధికార పరిధిలోనే లేఖ రాశాను. ఆ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారు. దీనిపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదు. దీనిపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదు’’ అని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని