టాప్ 10 న్యూస్ @ 9 AM
కొవిడ్, లాక్డౌన్ నేపథ్యంలో ఐటీ రంగంలోని నిపుణులు, ఇంజినీరింగ్ పూర్తి చేయబోతున్న విద్యార్థులు నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో నైపుణ్యం సాధించినప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకోగలరని తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ...
1. విరామం కాదిది... విజ్ఞాన సమయం
కొవిడ్, లాక్డౌన్ నేపథ్యంలో ఐటీ రంగంలోని నిపుణులు, ఇంజినీరింగ్ పూర్తి చేయబోతున్న విద్యార్థులు నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో నైపుణ్యం సాధించినప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకోగలరని తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా తెలిపారు. విద్యార్థులు ప్రస్తుత లాక్డౌన్ను విరామ, విశ్రాంతి సమయంగా భావించకూడదని, మొబైల్తో సమయాన్ని వృధా చేయడం కన్నా కొత్త టెక్నాలజీలతో విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ‘టాస్క్’ తరఫున తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. డాక్టర్లపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
కరోనా కట్టడికి తీవ్రంగా కృషిచేస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ విషయమై బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులపై ఇటీవల జరిగిన దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా దవాఖానాలోనూ మంగళవారం ఇదేతరహా ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు.. దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చట్టాలను ప్రయోగించాలని తెలంగాణ పోలీసుశాఖ యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మలేరియా ఔషధం... మర్మమిదే!
మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్పై ప్రపంచమంతా నమ్మకంగా ఉంది. కొవిడ్ బాధితులను రక్షించుకోవడానికి అమెరికా, బ్రెజిల్తోపాటు 30 వరకు దేశాలు మాకంటే మాకు ఈ ఔషధాన్ని పంపించాలని భారత్ను కోరుతున్నాయి. కొవిడ్పై హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫలితాలు ఒక్కోదేశంలో ఒక్కోలా ఉంటున్నాయి. స్వీడన్లో వాడగా ప్రతి 100 మందిలో ఒకరికి గుండె, మూత్రపిండాలపై దుష్ఫ్రభావం చూపుతున్నట్లు తేలింది. ఇవే కారణాలతో ‘15 సంవత్సరాలలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఈ మందు ఇవ్వకూడదు’ అంటూ భారత్లోనూ ఐసీఎంఆర్ ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మహమ్మారి తర్వాత..
ప్రతి మలుపులోనూ మంచి చెడూ రెండూ ఉంటాయి. ఇలాంటి సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. ప్రస్తుతం కరోనాపై చేస్తున్న పోరాటం ఏ ప్రపంచ యుద్ధానికీ తక్కువ కాదు. 200లకు పైగా దేశాలు ఒకవైపుంటే... అత్యంత సూక్ష్మజీవి మరోవైపు ఉంది. వైరస్పై గెలిచేందుకు ప్రభుత్వాలు వినూత్న, కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో మానవాళి విజయం సాధిస్తుందని... అయితే ఆ తర్వాత మనం భిన్నమైన ప్రపంచంలో జీవిస్తామని యువల్ నోవా హరారి(ఇజ్రాయెల్) లాంటి సుప్రసిద్ధ చరిత్రకారులు, భవిష్యత్ దర్శకులు విశ్లేషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పొగ తాగడం మానాల్సిందే
కొవిడ్-19 సోకిన వ్యక్తులలో 15 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని.. వీరు వైరస్ నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికాలోని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ వర్ధన్రెడ్డి సూచిస్తున్నారు. అన్ని దేశాల్లో 2-3 నెలల్లో 70% వరకూ పరిస్థితి అదుపులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. మధుమేహం, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్లకూ రిస్క్ ఎక్కువే. ఈ వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య ఉన్న వాల్వ్ను దెబ్బతీస్తుంది. అందుకే పొగ తాగే వారు.. మానేయకుంటే ప్రాణాంతకం అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సివిల్స్ ప్రాథమిక పరీక్షపై ఉత్కంఠ
సివిల్స్ ప్రాథమిక పరీక్ష మే 31న జరుగుతుందా? లేదా? అన్న అంశంపై మే 3వ తేదీ వరకు ఉత్కంఠ కొనసాగనుంది. బుధవారం సమావేశమైన యూపీఎస్సీ బోర్డు.. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఉన్నందున ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటివరకు సందిగ్ధం తప్పదు. దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది పరీక్షకు హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేల మంది దరఖాస్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. నిర్మాణరంగం కుదేలు
కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19) దేశ ఆర్థిక వ్యవస్థ మూలాధారమైన నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నష్టాలను అదుపు చేయాలని ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ విశ్లేషించింది. అంతేగాక ఆర్థిక వ్యవస్థను సత్వరం మళ్లీ గాడిలో పెట్టాలంటే ఈ రంగానికి పెద్దపీట వేయాలని తాజాగా ఒక నివేదికలో సూచించింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వెంటనే ప్రారంభం అయ్యేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు, ఏఏ ప్రాజెక్టులు ముందుగా చేపట్టాలి- అనేది నిర్దేశించుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. యాపిల్ కొత్త ఐఫోన్ విడుదల
ఎప్పుడూ ఉండే అభిమానుల సందడి, కోలాహలం లేకుండానే యాపిల్ తన కొత్త ఐఫోనును ఆవిష్కరించింది. నవీకరించిన ఈ ఐఫోన్ ఎస్ఈ ధర 399 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుంది. యాపిల్ ప్రధాన మోడళ్ల ధరలో ఇది సగం కంటే తక్కువ కావడం గమనార్హం. 40కి పైగా విపణుల్లో శుక్రవారం నుంచి ఈ కొత్త ఐఫోను లభ్యమవుతుందని పేర్కొంది. 4.7 అంగుళాల తెర (డయాగ్నల్లీ)తో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి తరం ఐఫోన్ ఎస్ఈ తెర పరిమాణం కంటే ఇది ఎక్కువగా కాగా.. కొత్త ఫోన్ల తెరతో పోలిస్తే దీని తెర చిన్నది. అయినప్పటికీ.. హైడెఫినిషన్ గ్రాఫిక్స్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 2021 మహిళల వన్డే ప్రపంచకప్నకు భారత్ అర్హత
మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు 2021 మహిళల వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ (2017-2020)లో భాగంగా ఆడాల్సివున్న మూడు సిరీస్లు రద్దవగా, ఆ సిరీస్లకు సంబంధించి ఐసీసీ తాజాగా పాయింట్లను పంచింది. ఇందులో రెండు సిరీస్ల రద్దుకు కరోనా కారణం కాగా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్తో సిరీస్ ఆడేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో ప్రతి జట్టూ.. మరో జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వడ్డీ వ్యాపారి దా‘రుణం’
వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆగ్రహానికి గురైన ఓ వడ్డీ వ్యాపారి రుణగ్రహీతపై దాడికి పాల్పడిన సంఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సులానగర్లో బుధవారం చోటుచేసుకుంది. టేకులపల్లి ఎస్సై ఇమ్మడి రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సులానగర్కు చెందిన అజ్మీరా హట్యా అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. వీటిలో రూ.1.50 లక్షలు ఇటీవల చెల్లించాడు. లాక్డౌన్ కారణంగా మిగిలిన అసలు, వడ్డీ చెల్లించేందుకు గడువు కోరాడు. ఈ క్రమంలో హన్మా కోపంతో హట్యా ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్