ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  2006 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలుగా

Updated : 16 Apr 2020 15:26 IST

హైదరాబాద్‌: డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  2006 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలుగా ఇప్పటికే పదోన్నతులు కల్పించారు. తాజాగా వారికి డీఐజీ ర్యాంకు స్థాయిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. 

డీఐజీ హోదాలో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కార్తికేయ కొనసాగుతారు. డీఐజీ హోదాలో రాజబహద్దూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీ ఉప సంచాలకులుగా రమేష్‌ నాయుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు. డీఐజీ హోదాతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా సత్యనారాయణ కొనసాగుతారు. సీఐడీ విభాగంలో డీఐజీలుగా సుమతి, శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సైబరాబాద్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా వెంకటేశ్వరరావును నియమించారు. మాదాపూర్‌ డీసీపీగా కూడా ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు