అంత వయస్సులోనూ ఉత్సాహంగా..
ఆ బామ్మ వయస్సు 98 ఏళ్లు. కర్ర ఊతంగా చేసుకుని నడుస్తుంది. ఒక కన్ను మసకగా కనిపిస్తుంది. అయితేనేం.. ఆమె సంకల్ప శక్తి గొప్పది. ప్రస్తుతం ఆమె కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది. అంత వయస్సులోనూ ఉదయాన్నే లేచి.. ప్రార్థనలు పూర్త చేసుకుని.. ఆ తర్వాత కుట్టు యంత్రంపై ఉత్సాహంగా మాస్కులు కుడుతోంది.
మాస్కులు కుడుతున్న 98 ఏళ్ల పంజాబ్ బామ్మ
చండీగఢ్: ఆ బామ్మ వయస్సు 98 ఏళ్లు. కర్ర ఊతంగా చేసుకుని నడుస్తుంది. ఒక కన్ను మసకగా కనిపిస్తుంది. అయితేనేం.. ఆమె సంకల్ప శక్తి గొప్పది. ప్రస్తుతం కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది. అంత వయస్సులోనూ ఉదయాన్నే లేచి.. ప్రార్థనలు పూర్తి చేసుకుని.. ఆ తర్వాత ఉత్సాహంగా మాస్కులు కుట్టడంలో నిమగ్నమవుతోంది. కుటుంబీకుల సహకారంతో సమీప వాసులకు ఉచితంగా అందజేస్తోంది. ఆమె.. పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాకు చెందిన గురుదేవ్ కౌర్ ధాలివాల్. ఆమె వినియోగిస్తున్న కుట్టుమిషన్ సైతం వందేళ్ల క్రితం నాటిది కావడం విశేషం.
ఉచితంగా పంపిణీ చేస్తూ..
వృద్ధురాలి కోడలు అమర్జిత్ కౌర్ వివరాలు వెల్లడిస్తూ.. ‘అధిక ధరల కారణంగా కొనుగోలు చేసే శక్తి లేక మా ప్రాంతంలో కూరగాయలు విక్రయించేవారు మాస్కులు ధరించేవారు కాదు. దీంతో మేం వారికి ఉచితంగా అందజేసేందుకు ముందుకువచ్చాం. ఈ క్రమంలో ఇరుగు పొరుగువారూ మాకు తోడ్పాటునందిస్తున్నారు. కొందరు వస్త్రం సమకూర్చుతున్నారు. మాస్కుల కోసం పలువురు రోజూ మా ఇంటికి వస్తున్నారు’ అని తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో అందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్