తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది.

Updated : 19 Apr 2020 15:34 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తాజా కేబినెట్‌ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలా? వద్దా? లేక, రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రత్యేక నిబంధనలను అమలుచేయాలా.. అనే అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకునే వీలుంది.

ఈ నెల 25 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలు కీలకం కానున్నాయి. ఈ అంశాలన్నింటిపై వివిధవర్గాల అభిప్రాయాలను సీఎం ఇప్పటికే సేకరించారు. వాటన్నింటిని మంత్రిమండలికి నివేదించి నిర్ణయం తీసుకునే వీలుంది. మంత్రివర్గ భేటీ అనంతరం వీటన్నింటిపై స్పష్టత రానుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశముంది. ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల వేతనాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని