శ్రీకాళహస్తిలో కొత్తగా 11 కరోనా కేసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ..

Updated : 19 Apr 2020 20:22 IST

తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు మెడికల్‌ దుకాణాల యజమానులు సహా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ వివరాలు వెల్లడించారు. బాధితుల కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించామన్నారు. తాజాగా నమోదైన కేసులతో శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్‌ అమల్లో ఎలాంటి మినహాయింపులు లేవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని