టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య విషయాలు, వార్తల్లో కొన్ని ముఖ్యమైనవి... 

Updated : 13 Sep 2023 14:46 IST

1. కేంద్రం సడలింపులు నేటి నుంచి

జీవితాలను రక్షించుకుంటూనే జీవనోపాధి పొందడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కొనసాగించుకోవడానికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్తగా మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రవాసులపై కోవిడ్‌ ప్రతాపం

ఉన్నత ఉద్యోగం, చక్కటి ఉపాధి, నాణ్యమైన విద్య... ఈ మూడింటి అన్వేషణలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. సాంకేతికతపై భరోసాతో అమెరికా వెళ్లినా, రెక్కల కష్టంపై నమ్మకంతో అరేబియా ఎడారుల్లో అడుగిడినా, చదువులమ్మ దీవెనలు ఆకాంక్షిస్తూ ఏదేశమేగినా... అక్కడ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. జన్మభూమిలోని లక్షలాది మందికి తోవ చూపుతుంటారు. అనూహ్యంగా ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్‌ ఇలాంటి లక్షలాది మంది ఆశలపై నీళ్లు గుమ్మరిస్తోంది. ప్రస్తుతం ఆయా దేశాల్లో తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో పలువురు ‘ఈనాడు’తో ఫోన్‌లో పంచుకున్నారు. ఇవీ వివరాలు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి

 కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్‌  వల్ల లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజల్ని అసలే బయటకు రావొద్దని సూచించారు. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించాడని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంకెన్ని లింకులున్నాయో..?

 సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్‌, ఔషధ దుకాణం ప్రాంతంలో వైరస్‌ ఎలా విస్తరించిందన్న దానిపై వివిధ కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఔషధ దుకాణంలో పనిచేసే వ్యక్తి నుంచి అక్కడికి వచ్చిన మహిళ ద్వారా కరోనా సోకిన నేపథ్యంలో అక్కడ ఇంకా ఎవరు ఔషధాలు కొనుగోలు చేశారనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దుకాణం ప్రైవేటు వైద్యశాలలు విస్తరించిన ప్రాంతంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అగ్రరాజ్యానికి కాసింత ఊరట

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ దేశాలకు ఆదివారం కొంతలో కొంత ఉపశమనం లభించింది. మునుపటి రోజులతో పోలిస్తే పరిస్థితి కాస్త తెరిపిన పడింది. ప్రాణనష్టం కాస్త తగ్గుముఖం పట్టింది. న్యూయార్క్‌లో మృతుల సంఖ్య ఆదివారం 550 కంటే తక్కువ నమోదయింది. ఈ స్థాయికి ప్రాణనష్టం తగ్గడం గత రెండువారాల్లో ఇదే తొలిసారి. కొత్తగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ఐసీయూలలో చేరే రోగుల సంఖ్య తగ్గింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహన్‌లు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న వేళ- ఇప్పుడు అన్ని వేళ్లూ వుహాన్‌(చైనా)లోని పీ4 ల్యాబ్‌ వైపు చూపిస్తున్నాయి. వైరస్‌ పుట్టుకకు ఈ ప్రయోగశాలే వేదిక అనే వాదనలు జోరందుకున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో చైనా కుట్ర కోణం ఉందన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే లీకయిందా? ఇది నిజంగా జీవాయుధమా? వైరస్‌ ప్రబలడంలో గబ్బిలాల పాత్ర ఎంత? చైనా చెబుతున్నట్లు వుహాన్‌లోని మాంసం విక్రయ మార్కెట్‌ దీని వ్యాప్తికి ఎంతవరకు కారణం? వైరస్‌ వ్యాప్తి నిజంగా కుట్రేనా? అలా అయితే దానిపై నిపుణులు ఏమంటున్నారు? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కృత్రిమ యాంటీబాడీలతో కరోనా కట్టడి!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యనిపుణులు, పరిశోధకులు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయోగశాలల్లో నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మహమ్మారి బారి నుంచి బాధితులను కాపాడేందుకు వేర్వేరు చికిత్స పద్ధతులను అనుసరిస్తున్నారు. సరైన మందులు, టీకా లేకపోవడంతో ప్లాస్మా చికిత్సపై వైద్యనిపుణులు దృష్టి సారించారు. అనుకున్నంత కాకపోయినా సంతృప్తికరమైన ఫలితాలొస్తుండడంతో చికిత్సలో ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే : చిరంజీవి

పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలీసుశాఖలో కరోనా కలకలం

‘మీ ఆరోగ్యం కోసం మేం వీధుల్లో ఉంటాం. మీరు ఇంట్లోనే ఉండండి’  అంటూ భరోసా ఇస్తున్న పోలీసన్నలపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా రెండు రోజుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్‌ సోకడంతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది.   క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వైరస్‌ సోకుతుండటం కొంత కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా గత నెల 22 నుంచి రాష్ట్రంలో దాదాపు 60వేల మంది పోలీసులు రోడ్లకే అంకితమయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రధాని చెప్పిన పానీయం

రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రజలంతా ‘కధా’ తాగాలని ప్రధాని కోరారు. వనమూలికలు, సుగంధ ద్రవ్యాల సమ్మేళనమైన ఈ ఆయుర్వేద పానీయాన్ని ఎలా తయారుచేయాలంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని