అంబులెన్స్లో 3 వేల కిమీ ప్రయాణం
లాక్డౌన్ వేళ చెన్నై నుంచి త్రిపురకు 3 వేల కిలోమీటర్లకుపైగా అంబులెన్స్లో ప్రయాణించారు పలువురు. త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన భార్య, భర్తలు శస్త్రచికిత్స నిమిత్తం చెన్నైకు...
చెన్నై నుంచి త్రిపురకు..
అగర్తాలా: లాక్డౌన్ వేళ చెన్నై నుంచి త్రిపురకు 3 వేల కిలోమీటర్లకుపైగా అంబులెన్స్లో ప్రయాణించారు పలువురు. త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన భార్య, భర్తలు శస్త్రచికిత్స నిమిత్తం చెన్నైకు వచ్చి లాక్డౌన్తో ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఓ అంబులెన్స్ మాట్లాడుకొని 3,213 కి.మీ ప్రయాణించారు. చివరికి ఆదివారం సాయంత్రం సొంతూరుకు చేరుకోవడంతో అధికారులు వారిని క్వారెంటైన్కు తరలించారు. అసలేం జరిగిందంటే.. గోమతి జిల్లా ఉదయ్పూర్కు చెందిన చంచల్ మజుందర్, ఆయన భార్య అషిమా శస్త్రచికిత్స కోసం గతనెల చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చారు. అది పూర్తయ్యాక తిరిగి త్రిపురకు వెళ్దామనుకునేసరికి లాక్డౌన్ అమల్లోకివచ్చింది. చెన్నైలో ఉండేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడం.. అలాగే మే 8న తమ కుమార్తె వివాహం కూడా ముందే నిశ్చయమవడంతో.. ఎలాగైనా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోనే ఓ అంబులెన్స్ మాట్లాడుకొని త్రిపురకు బయలుదేరారు. ఈ ప్రయాణంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతీచోట వైద్య నివేదికలు చూపించాల్సి వచ్చింది.
‘మా కూతురి వివాహం మే 8న నిశ్చయమవడంతో మేం చెన్నై నుంచి బయలుదేరాల్సి వచ్చింది. మాతో పాటు త్రిపురకు చెందిన మరో పేషంట్, వాళ్ల కుటుంబీకులు మరో ఇద్దరితో కలిసి ఇక్కడికి బయలుదేరాం’ అని మజుందర్ సోమవారం మీడియాకు వివరించారు. ఆదివారం సాయంత్రం అంబులెన్స్ ఉదయ్పూర్కు రాగానే వారిని ప్రభుత్వ క్వారెంటైన్కు తరలించామని జిల్లా కలెక్టర్ తరుణ్ కాంతి దేబ్నాథ్ తెలిపారు. మరోవైపు త్రిపురలో మంగళవారం ఉదయం నాటికి రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటికే ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా, మరొకరు అగర్తాలాలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్