‘కట్టడి’ గోడ!

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని చిక్కడపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలతో మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి

Updated : 22 Apr 2020 07:37 IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని చిక్కడపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలతో మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి స్థానికుల రాకపోకలను నియంత్రించేందుకు అంతర్గత రహదారులపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి స్థానికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు కాలనీలోని ప్రధాన రహదారిపై అడ్డుగోడ నిర్మించారు.

-న్యూస్‌టుడే, నిర్మల్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని