ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు: చంద్రబాబు

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ మాసం ప్రారంభం

Updated : 23 Apr 2020 11:54 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపాలని సూచించారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్‌ పవిత్ర దీక్షల పరమావధి కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలంటూ భగవంతుడిని ప్రార్థిచాలని ముస్లిం సోదరులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని