కలచివేస్తోంది: బెంగాల్పై ‘మమత’ చూపండి!
తగినన్ని కొవిడ్-19 పరీక్షలు చేయకపోవడం, మరణాలను తప్పుగా నివేదించడం తీవ్రంగా కలచివేస్తోందని కొందరు వైద్యులు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగానూ పరీక్షల సంఖ్య తక్కువే ఉన్నా బెంగాల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు....
ముంబయి: తగినన్ని కొవిడ్-19 పరీక్షలు చేయకపోవడం, మరణాలను తప్పుగా నివేదించడం తీవ్రంగా కలచివేస్తోందని కొందరు వైద్యులు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగానూ పరీక్షల సంఖ్య తక్కువే ఉన్నా బెంగాల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఆ రాష్ట్ర మూలాలున్న నాన్ రెసిడెంట్ వైద్యులు, ఆరోగ్య శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది లేఖ రాసిన వారిలో ఉన్నారు.
‘గత వారం రోజులుగా పశ్చిమ్ బెంగాల్లో పరిస్థితులు దారుణంగా ఉండటం మేం చూశాం. మమ్మల్ని రెండు అంశాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. 1) బెంగాల్లో కొవిడ్-19 పరీక్షలు తక్కువగా ఉన్నాయి. 2) కొవిడ్-19తో మృతి చెందిన వారి వివరాలు తప్పుగా ఇస్తున్నారు’ అని వైద్యులు ఆ లేఖలో రాశారు. జాతీయ పరీక్షల సగటు 156.9/పది లక్షల కన్నా బెంగాల్ సగటు 33.7/పది లక్షలు అత్యంత తక్కువని పేర్కొన్నారు. రోజుకు వెయ్యి పరీక్షలు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత తక్కువ చేయడం ఘోరమని వాపోయారు. పరీక్షలు చేయడం ద్వారానే కరోనా వ్యాప్తిపై నిజమైన అంచనా వస్తుందని సూచించారు.
‘కరోనా కేసుల్ని తక్కువ చేయడం విపరిణామాలకు దారితీస్తుంది. మొదట బాధితులకు చికిత్స అందించే వైద్య సదుపాయాలు, సామర్థ్యం కొరవడతాయి. లక్షణాలు బహిర్గతం కానివారు తెలియకుండానే కొవిడ్-19ను వ్యాప్తి చేస్తారు. కరోనాతో మృతిచెందారో లేదో రాష్ట్ర నియమిత కమిటీయే నిర్ధారిస్తోంది. శ్వాస వైఫల్యంతో కొవిడ్ బాధితుడు మృతిచెందినా కమిటీ ఆ మరణానికి కారణం కొవిడ్గా గుర్తించడం లేదు’ అని వైద్యబృందం పేర్కొంది. వెంటనే పరీక్షల సంఖ్య పెంచి కచ్చితమైన సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు బెంగాల్లో 7,034 పరీక్షలు చేయగా ఆంధ్రప్రదేశ్లో 41,512, రాజస్థాన్లో 55,759, తమిళనాడులో 53,045 పరీక్షలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్, పంజాబ్ మాత్రమే బెంగాల్ కన్నా తక్కువ పరీక్షలు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్