
వరుడు.. వధువు జూమ్లో జామ్జామ్గా పెళ్లి!
ముంబయి: లాక్డౌన్ కారణంగా పెళ్లి చేసుకోవాల్సిన జంటలు వాయిదా వేసుకుంటున్నాయి. ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి కొందరు సామాజిక దూరం పాటిస్తూ మూడు ముళ్ల బంధానికి సిద్ధమవుతున్నారు. మరికొందరైతే ఆన్లైన్ వేదికగా పెళ్లి తంతు ముగించేస్తున్నారు. ముంబయికి చెందిన యువకుడు, బరేలీకి చెందిన యువతి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా ఒకటయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ముంబయికి చెందిన సుషేన్ దంగ్ అనే 26 ఏళ్ల యువకుడికి ఉత్తర్ప్రదేశ్లోని బరేలీకి చెందిన కీర్తి నారంగ్ అనే యువతికి వివాహం నిశ్చయమైంది. వందల మంది పెద్దల సమక్షంలో విందు, వినోదాలతో వివాహం చేసుకోవాలని భావించింది ఈ జంట. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువురు డిజిటల్ వివాహం అదేనండీ.. వీడియో కాల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో జూమ్ యాప్ వేదికపై.. సుషేన్ దంగ్ ముంబయిలోని తన తల్లిదండ్రుల సమక్షంలో సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమారుడిగా సిద్ధం కాగా.. లెహెంగా దుస్తుల్లో కీర్తి పెళ్లి కూతురుగా ముస్తాబైంది. కీర్తినారంగ్ తండ్రి ఆన్లైన్ వేదికగా దంగ్కు కన్యాదానం చేశారు. మరి ఈ పెళ్లికి అతి ముఖ్యమైన వ్యక్తి పురోహితుడు ఎక్కడునుకుంటున్నారా? పురోహితుడు కూడా ఆన్లైన్లోనే మంత్రాలు చదువుతూ వివాహ తంతును పూర్తి చేశారు. ఆయన వధువరుల వద్ద కాదు.. రాయ్పూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇరు కుటుంబాల బంధువులు కూడా వారి వారి ఇళ్లలో ఉండి.. పెళ్లిని వీక్షించారు. దంగ్, కీర్తి నారంగ్ల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చాలా మంది అతిథుల సమక్షంలో నిర్వహించాలని ఇరు కుటుంబాలు ముందే ఏర్పాట్లు చేసుకున్నాయనట. అయితే తన పెళ్లి ఇంత ప్రత్యేకంగా జరుగుతుందని ఊహించలేదని దంగ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ డిజిటల్ వివాహాన్ని జరిపించిన షాదీ.కామ్ సంస్థ సీఈవో అనుమప్ మిత్తల్ మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో వివాహం చేసుకోవాలనుకున్నా వీరికి తమవంతుగా సాయం అందించామన్నారు. ఇప్పటికే పలు డిజిటల్ వివాహాలను జరిపించామని చెప్పారు. అయితే వీటి వల్ల సాధారణంగా బయట జరిగే వివాహాది వేడుకలు కనుమరుగవుతాయని తాను భావించట్లేదని మిట్టల్ అన్నారు. ఎందుకంటే ‘‘భారత్లో వివాహం రెండు జంటల మధ్య జరిగే వేడుక కాదు. ఇరు కుటుంబాల బంధం ’’అని మిత్తల్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lalu Prasad Yadav: కదలికలు లేని స్థితిలో లాలూ.. తేజస్వీ యాదవ్ వెల్లడి
-
World News
Boris Johnsion: ప్రపంచంలోనే ఉత్తమ జాబ్ వదులుకోవడం బాధగా ఉంది!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Sai pallavi: సినీనటి సాయిపల్లవి పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
-
General News
MP Arvind: ఎంపీగా ఉన్న నాపైనే హత్యాయత్నం జరిగింది.. సీపీని తప్పించాలి: అర్వింద్
-
General News
covid cases: తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా.. కొత్తగా 592 కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?