మనవరాలితో టేబుల్‌ టెన్నిస్‌ ఆడిన మంత్రి 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు, సినీతారలు, ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. వాళ్లకు ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Updated : 25 Apr 2020 18:45 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు, సినీతారలు, నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. వాళ్లకు ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు లాక్‌డౌన్‌ సమయంలో సరదాగా మనవరాలితో ఆడుకున్నారు.
 హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మనవరాలు తన్వితో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. ఇందకు సంబంధించిన చిత్రాలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని