లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ‘పది’ పరీక్షలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిజిటల్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ

Updated : 29 Apr 2020 13:07 IST

కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ మంత్రి

అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిజిటల్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారని.. ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాల తర్వాత ఆ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని రమేశ్‌ పోఖ్రియాల్‌కు ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని