నాన్నకు 72 ఏళ్లు.. పెరోల్ ఇవ్వండి
కరోనా ముప్పు నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్కు పెరోల్ ఇవ్వాలని బిహార్ ప్రతి పక్షనేత తేజస్వీ యాదవ్ కోరారు. కొవిడ్-19 బాధితులను కలవడంతో క్వారైంటైన్కు వెళ్లిన వైద్యులు తన తండ్రికి వైద్యం చేసినట్టు వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు....
ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వీ ఆవేదన
రాంచీ: కరోనా ముప్పు నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్కు పెరోల్ ఇవ్వాలని బిహార్ ప్రతి పక్షనేత తేజస్వీ యాదవ్ కోరారు. కొవిడ్-19 బాధితులను కలవడంతో క్వారైంటైన్కు వెళ్లిన వైద్యులు తన తండ్రికి వైద్యం చేసినట్టు వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దాణా కేసులో దోషిగా తేలడంతో 2017, డిసెంబర్ నుంచి లాలూప్రసాద్ యాదవ్ ఝార్ఖండ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మూత్ర పిండాలు, గుండె, మధుమేహ సమస్యలుండటంతో ప్రస్తుతం ఝార్ఖండ్లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడీ ఆస్పత్రిని కరోనా కేసుల చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించారు. రిమ్స్లో కేసులు పెరుగుతుండటంతో లాలూకు పెరోల్ ఇవ్వడంపై న్యాయ సలహాలు స్వీకరిస్తున్నామని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఏప్రిల్ 13న పేర్కొన్న సంగతి తెలిసిందే.
‘నేను ఆందోళన చెందుతున్నా. ఎందుకంటే మా నాన్న వయసు 72 ఏళ్లు. మూత్రపిండాలు, గుండె, మధుమేహ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మా నాన్నకు మరింత భద్రత అవసరం’ అని తేజస్వీ అన్నారు. ‘కేవలం కుటుంబాలు ఉన్నవారికి మాత్రమే నా బాధేంటో తెలుస్తుంది’ అని పేర్కొనడం గమనార్హం. తన తండ్రిని పెరోల్పై విడుదల చేయాలని అప్పీల్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM