కన్నతండ్రే కాలయముడు!

కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఇద్దరు కుమారులను తుపాకీతో కాల్చి తానూ అదే ఆయుధానికి బలయ్యాడో తండ్రి. ఈ  ఘటన మహారాష్ట్రలోని

Updated : 29 Apr 2020 06:25 IST

కొడుకులను కాల్చి.. తానూ నేలకొరిగి

బల్లార్ష : కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఇద్దరు కుమారులను తుపాకీతో కాల్చి తానూ అదే ఆయుధానికి బలయ్యాడో తండ్రి. ఈ  ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా బల్లార్‌పూర్‌లో జరిగింది. పట్టణవాసి మూల్‌చంద్‌ ద్వివేది(50)కి లైసెన్స్‌డ్‌ తుపాకీ ఉంది. మంగళవారం అతడికి కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన మూల్‌చంద్‌ తన కుమారులు ఆకాష్‌(22), పవన్‌(20)లపై తుపాకితో కాల్పులు జరిపాడు. అనంతరం తానూ కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆకాష్‌ని చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మరో కుమారుడు పవన్‌ అదే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని