ఐస్క్రీమ్ తింటే కరోనా వస్తుందా?
ఐస్క్రీమ్, ఇతర చల్లని పదార్ధాలు తినటం వల్ల కరోనా వైరస్ సోకుతుందనే భావన ఒకటి.
కొవిడ్-19 అపోహలపై వివరణ ఇదిగో...
దిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో కొవిడ్-19 బాధితుల సంఖ్య మిలియన్లలో, మృతుల సంఖ్య వేలల్లోనూ ఉంది. వాటితో పోలిస్తే భారత గణాంకాలు ఊరట కలిగిస్తున్నప్పటికీ... దేశంలో ఈ మహమ్మారి గురించి పలు అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని పాటించటం ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన అపోహల్లో ఐస్క్రీమ్, ఇతర చల్లని పదార్థాలు తినటం వల్ల కరోనా వైరస్ సోకుతుందనే భావన ఒకటి. చల్లని పదార్థాలను తినటం లేదా తాగటం వల్ల కొవిడ్ సోకుతుంది అనేందుకు ఏ ఆధారము లేదని ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాధి గురించి ప్రచారంలో ఉన్న అనేక అసత్యాలలో ఇది కూడా ఒకటి అని సంస్థ తెలిపింది. ప్రమాదకరమైన కరోనా వ్యాధికి సంబంధించిన పుకార్లలోని నిజానిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైట్ ద్వారా నిర్ధారించుకోవచ్చని పీఐబీ వెల్లడించింది.
వెల్లుల్లిని ఆహారంలో తీసుకున్నా, సూప్లో మిరియాల పొడిని కలుపుకొన్నా కరోనా తగ్గిపోతుందనే భావన కూడా నిజం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) వివరించింది. ఆ రెండు పదార్థాలూ ఆరోగ్యానికి మంచివని, అయితే వాటివల్ల కరోనా నివారించవచ్చు అనేందుకు ఏ ఆధారాలు లేవని ఈ సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా క్రిమి సంహారక ద్రవాన్ని శరీరంపై జల్లుకోవటం, వేడినీటితో స్నానం చేయటం, శరీర ఉష్ణోగ్రత అధికమయ్యేలా చేసుకోవటం, సూర్యరశ్మి సోకేవిధంగా బయట నిలబడటం వల్ల కరోనా నశిస్తుందనటం సరికాదని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఇక ఈగలు, దోమల వల్ల కొవిడ్-19 వ్యాప్తిస్తుందనేది కూడా నిజం కాదని సంస్థ వెల్లడించింది. పుకార్లను నమ్మటం మాని... సామాజిక దూరాన్ని పాటించటం, వీలయినంత వరకూ ఇంటికే పరిమితం కావటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్ను దూరంగా ఉంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!