కరోనా అవగాహనపై విశాఖ యువత పాట
ఎక్కడో చైనాలో ఉనికిలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే ఎంతో మంది సినీ గాయకులు, రచయితలు పాటల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ పాటించాలని..
ఆవిష్కరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
విశాఖ: ఎక్కడో చైనాలో ఉనికిలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే ఎంతో మంది సినీ గాయకులు, రచయితలు పాటల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ పాటించాలని ఎంతో మంది వారికి తోచిన విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో మేము సైతం అంటూ విశాఖ యువత పాట ద్వారా ముందుకొచ్చారు. ‘ఇది ఒక యుద్ధం.. కరోనాతో యుద్ధం’ అని రూపొందించిన పాట పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని కళ్లకుకడుతోంది. విశాఖకు చెందిన సంతోష్ ఎడ్లప ఈ పాటను నిర్మించారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కేటీవీ రమేశ్ ఈ పాటకు సాహిత్యం, సంగీతం, గాత్రాన్ని అందించారు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఈ పాటను ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!