పరీక్షలు చేశాకే కూలీలు, కార్మికుల తరలింపు
వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో
ఏపీ కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు
అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజల వివరాలను ఆయా రాష్ట్రాల సీఎస్లకు పంపించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ప్రభుత్వానికి రిపోర్టు చేశారని కృష్ణబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో సుమారు 64,300 మంది కూలీలు ఉన్నారని.. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 వేల మంది పొగాకు పనుల కోసం వచ్చారని చెప్పారు. గుజరాత్ నుంచి బయలుదేరిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు రేపు మధ్యాహ్నానికి రాష్ట్రానికి చేరుకుంటారని వెల్లడించారు. ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్ రూం నంబర్ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు వివరించారు.
రాష్ట్రంలోని గ్రీన్జోన్లలో కార్యకలాపాలు పెంచుతున్నట్లు కృష్ణబాబు చెప్పారు. గ్రీన్జోన్లలో 40 శాతం సిబ్బందితో పని చేసేందుకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రీన్ జోన్లలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చామన్నారు. గుంటూరు గ్రీన్ జోన్ నుంచి కర్నూలు గ్రీన్జోన్కు తొలి బృందాన్ని పంపినట్లు కృష్ణబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!