ఆహారం లేక రాళ్లు వండిన మాతృమూర్తి
ఎనిమిది మంది సంతానం గల ఓ మహిళ లాక్డౌన్ కారణంగా వండటానికి ఏమీ లేని పరిస్థితిలో...
నైరోబీ: ఎనిమిది మంది సంతానం గల ఓ తల్లి లాక్డౌన్ కారణంగా వండటానికి ఏమీ లేని పరిస్థితిలో నీళ్లలో రాళ్లు వేసి పొయ్యిమీద ఉడికించటం మొదలుపెట్టింది. ఏడుస్తున్న తన పిల్లలను ఏదో వండుతున్నట్టు నటిస్తూ మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఆఫ్రికా ఖండంలోని కెన్యాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
కెన్యాకు చెందిన కిటాసో ఓ చదువురాని మహిళ. నీరు, కరెంటు వంటి కనీస సదుపాయాలు లేని చిన్న ఇంటిలో తన ఎనిమిది మంది పిల్లలతో నివసిస్తోంది. భర్త దొంగల దాడిలో మృతి చెందటంతో చుట్టుపక్కల ఇళ్లలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో ఆ దేశంలో కూడా లాక్డౌన్ విధించారు. దీనితో పనులు లేక కిటాసోకు రోజుగడవటం కష్టమైంది. తినటానికి ఏమీ లేకపోవటంతో ఆమె పిల్లలు ఆకలితో అలమటించారు.
‘‘నా మిగిలిన పిల్లలు కాస్త పెద్దవాళ్లు. తినటానికి ఏమీ లేదని చెపితే అర్థం చేసుకుంటారు. కానీ వయసులో చాలా చిన్నదైన మా ఆఖరి అమ్మాయి ఆకలికి ఓర్చుకోలేక ఏడవటం మొదలుపెట్టింది. ఇలా చేస్తే అమ్మ ఏదో వండుతోందన్న ఉద్డేశంతో తను ఊరుకుంటుందని నేను ఈ పని చేశాను.’’ అని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు వివరించింది.
ఈ దయనీయ పరిస్థితిని గమనించిన పొరుగు మహిళ ఒకరు మీడియాకు సమాచారమివ్వటంతో కిటాసో పరిస్థితి లోకానికి తెలిసింది. ఆ మహిళ కిటాసో పేరుమీద ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచింది. దీనితో కెన్యాకు చెందిన అనేక మంది ఆమెకు సహాయంగా డబ్బు పంపించటం మొదలుపెట్టారు. తనకు అందుతున్న సహాయం ఓ ఆద్భుతం అని కిటాసో అభిప్రాయపడింది. తనకు సాయం చేస్తామంటూ ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయని... తన దేశప్రజలు ఇంతగా ఆదరణ చూపుతారనుకోలేదని కిటాసో వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!