గాంధీ వైద్యురాలికి ఘన స్వాగతం

కరోనా వైరస్‌ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చేరిన బాధితులకు వైద్య సేవలందించి ఇంటికి చేరుకున్న వైద్యురాలికి అపార్ట్‌మెంట్‌ వాసులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ సైనిక్‌పురికి చెందిన డా. విజయశ్రీ కరోనా బాధితులకు చికిత్స అందించడంతో....

Updated : 29 Jun 2023 18:39 IST


హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చేరిన బాధితులకు వైద్య సేవలందించి ఇంటికి చేరుకున్న వైద్యురాలికి అపార్ట్‌మెంట్‌ వాసులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌ సైనిక్‌పురికి చెందిన డా.విజయశ్రీ కరోనా బాధితులకు చికిత్స అందించడంతో కాలనీ, అపార్ట్‌మెంట్‌ వాసులు ఆమెకు అండగా నిలిచి చప్పట్లు, కేరింతలతో స్వాగతం పలికారు. దీంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించడం గొప్ప విషయమని వారు అభినందించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని