భారత్లో మహమ్మారి మారిందా..?
గత రెండు నెలల్లో భారత్లో కరోనా వైరస్ ఉత్తరివర్తనం (మ్యుటేషన్) చెందిందో లేదో తెలుసుకొనేందుకు ఐసీఎంఆర్ అధ్యయనం చేయనుంది. సార్స్-కొవిడ్2 స్ట్రెయిన్లో మార్పు జరిగిందో లేదో తెలుసుకుంటే వ్యాక్సిన్ను సమర్థంగా రూపొందించేందుకు సాయపడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు....
అధ్యయనం చేపట్టనున్న ఐసీఎంఆర్
దిల్లీ: గత రెండు నెలల్లో భారత్లో కరోనా వైరస్ ఉత్తరివర్తనం (మ్యుటేషన్) చెందిందో లేదో తెలుసుకొనేందుకు ఐసీఎంఆర్ అధ్యయనం చేయనుంది. సార్స్-కొవిడ్2 స్ట్రెయిన్లో మార్పు జరిగిందో లేదో తెలుసుకుంటే వ్యాక్సిన్ను సమర్థంగా రూపొందించేందుకు సాయపడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వైరస్ మరింత తీవ్రంగా మారిందా, వ్యాప్తివేగం పెరిగిందో లేదో తెలుస్తుందన్నారు.
ఈ అధ్యయనానికి కొవిడ్-19 రోగుల నమూనాలను సేకరించాల్సి ఉంది. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశాకే ఇది ఆరంభిస్తారని తెలిసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నమూనాలను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోని కరోనా వైరస్లో 02.-09 శాతమే తేడా ఉందని ఇన్ఫ్లూయెంజా సమాచారాన్ని పంచుకొనే అంతర్జాతీయ వేదిక (జీఐఎస్ఏఐడి) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 7000 జన్యు పరివర్తన క్రమాలను ఇది ఆవిష్కరించింది.
విదేశాల నుంచి వస్తున్న ప్రజల వల్లే భారత్లో వేర్వేరు వైరస్ స్ట్రెయిన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత్లో మూడు రకాల వైరస్ను గుర్తించారు. ఇవి వుహాన్, ఇటలీ, ఇరాన్కు చెందినవి. ఇరాన్ జన్యు పరివర్తన క్రమం దాదాపుగా చైనాకు సారూప్యంగా ఉంది.
‘దేశంలోని కరోనా వైరస్ పాక్షిక జాతులను తెలుసుకొనేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఉత్పరివర్తనాలు వ్యాక్సిన్లను అసమర్థంగా మార్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే అన్ని వైరస్ ఉప జాతుల్లోనూ ఒకేరకం ఎంజైములు ఉంటాయి. భారత్లో వైరస్ ప్రవేశించి మూడు నెలలే అయింది. కాబట్టి అంత వేగంగా ఉత్పరివర్తనం ఉండదు’ అని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేడ్కర్ గతంలో అన్నారు. ప్రస్తుతం భారత్లో ఆరు సంస్థలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: అమెరికాలో భారత ఔషధాన్నే ఉపయోగిస్తున్నారు
చదవండి: ట్రంప్ విమర్శిస్తున్నా చైనా మళ్లీ ప్రశంసించిన డబ్ల్యూహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!