కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులో కూలీలు
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపేందుకు ఓ వైపు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. వారు మాత్రం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ
ఇండోర్: లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపేందుకు ఓ వైపు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. వారు మాత్రం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర నుంచి ఉత్తర్ప్రదేశ్కు వలస కూలీలతో వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ ట్రక్కును శనివారం మధ్యప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రక్కులో 18 మంది కూలీలు ఉండడం చూసి అవాక్కయ్యారు. ఇండోర్ సమీపంలోని పంత్ పిప్లాయ్ చెక్పోస్టు వద్ద శనివారం ట్రక్కును తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. 18 మందిలో 14 మంది ఉత్తర్ప్రదేశ్కు చెందిన కూలీలు కాగా.. మిగతా నలుగురూ ట్రక్కు యజమానికి చెందిన వారు. వీరంతా శుక్రవారం రాత్రి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి బయలుదేరారు. వీరిని తరలిస్తున్న లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM