గ్రీన్, ఆరెంజ్ జోన్లలో క్షౌరశాలలు తెరచుకోవచ్చు
గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న క్షౌరశాలలను తెరచుకోవచ్చని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ నెల 4 నుంచి మొదలయ్యే మూడో దశ లాక్డౌన్లో ఇచ్చిన కొన్ని సడలింపులపై...
మార్గదర్శకాలపై హోంశాఖ స్పష్టత
దిల్లీ: గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న క్షౌరశాలలను తెరచుకోవచ్చని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ నెల 4 నుంచి మొదలయ్యే మూడో దశ లాక్డౌన్లో ఇచ్చిన కొన్ని సడలింపులపై శనివారం స్పష్టతనిచ్చింది. నిత్యావసరాలు కానివాటిని కూడా ఆ రెండు జోన్లలో ఈ-కామర్స్ సంస్థలు విక్రయించుకోవచ్చని తెలిపింది. రెడ్జోన్లలోనైతే ఈ-కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువుల్ని విక్రయించేందుకు అనుమతి ఉంది. రెడ్జోన్లలోని ఇళ్లలో పనిచేసేవారి విషయంలో స్థానిక నివాసుల సంక్షేమ సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కంటెయిన్మెంట్ ప్రాంతాలు మినహా అన్ని జోన్లలో మద్యం విక్రయాలను కొన్ని షరతులతో అనుమతిస్తారు. ఇవన్నీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్