సీతక్కా.. నువ్వు అక్క కాదు..అమ్మవి!
సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ములుగు
ఆ గ్రామానికి వెళ్లిన తొలి ప్రజాప్రతినిధి ఆమే!
వాజేడు: సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో రోజువారీ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలాంటి కష్టసమయంలో ఎంతోకొంత సహాయం చేయాలని భావించిన సీతక్క.. గత కొద్దిరోజులుగా ప్రజల వద్దకే నేరుగా వెళ్తున్నారు. వాళ్ల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల నిత్యావసరాలు అందివ్వడం, భోజన సౌకర్యాలు కల్పించడం.. ఇలా తన పరిధిలో చేయాల్సిన సహాయం చేస్తున్నారు. తన వాహనం వెళ్లలేని చోట తానే కాలినడకన వెళ్లి ఆయా బాధితులకు అండగా నిలబడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తాజాగా వాజేడు మండలంలో కొండలపైనున్న పెనుగోలు గిరిజన గ్రామానికి సీతక్క వెళ్లారు.
కూరగాయల మూట తలపై పెట్టుకుని..
వాజేడు మండల కేంద్రం నుంచి పెనుగోలు దూరం 20 కి.మీ. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ఆ గ్రామానికి చేరుకోవాలంటే కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీతక్క సైతం సుమారు 15 కి.మీ కాలినడకన నడిచారు. అవకాశం ఉన్నచోట మధ్యలో కొద్దిదూరం ద్విచక్ర వాహనం ఎక్కినప్పటికీ ఎక్కువ భాగం కాలినడకనే వెళ్లి పెనుగోలు చేరుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లేదారిలో కూరగాయల మూటను సైతం ఆమె స్వయంగా మోసుకుని వెళ్లారు. అక్కడ సీతక్క ఫౌండేషన్, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ, సర్వర్ ట్రస్టు ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు నిత్యావసరాలు, దుస్తులు అందజేశారు. దీంతో పెనుగోలు గ్రామానికి వెళ్లిన తొలి ప్రజాప్రతినిధిగా సీతక్క నిలిచారు. ఎమ్మెల్యే వెంట ములుగు సబ్ రిజిస్ర్టార్, సర్వర్ ట్రస్టు నిర్వాహకురాలు తస్లీమా మహ్మద్, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పీర్ల కృష్ణబాబు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీవీ సీతారామరాజు, నాగారం సర్పంచి ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ