ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు

ఏపీలో ఇవాళ్టి నుంచి అదనపు రీటైల్‌ ఎక్సైజు ట్యాక్సు పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భారత్‌లో తయారైన విదేశీ...

Updated : 04 May 2020 09:01 IST

అమరావతి: ఏపీలో ఇవాళ్టి నుంచి అదనపు రీటైల్‌ ఎక్సైజు ట్యాక్సు పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్లు, ఇతర మద్యం ధరలు పెరగనున్నాయి. 180 ఎంఎల్‌ రూ.120 ఉండే వాటిపై రూ.10 నుంచి రూ. 240 వరకు పెంపు విధించారు. 180 ఎంఎల్‌ రూ.150 వరకు ఉండే మద్యంపై రూ.20 నుంచి రూ.480 వరకు పెంచారు. రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యంపై రూ.30నుంచి రూ.720 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లు 330 ఎంఎల్‌కు రూ.20 నుంచి 5లీటర్ల బాటిల్‌కు రూ.3000 పెంచారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ధర పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ అమ్మకాలు సాగుతాయి. బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్‌ లైసెన్సుతో నడిచే కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని