స్థానికులకు 75శాతం రిజర్వేషన్లపై పిటిషన్‌

ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌. వరలక్ష్మి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 06 May 2020 17:25 IST

రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారా?: హైకోర్టు

అమరావతి: ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉన్న చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌. వరలక్ష్మి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

ఈ అంశంపై సర్కారు తరఫున ప్రభుత్వ న్యాయవాది సుమంత్‌ రెడ్డి స్పందిస్తూ పారిశ్రామికవేత్తలు ఎవరైనా దీనిపై పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంటుంది తప్ప న్యాయవాదులు, ఇతరులకు అవకాశంలేదని వాదనలు వినిపించారు. ఈ అంశంలో ప్రజాప్రయోజనం కూడా ఇమిడి ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే ఈ నిర్ణయం తీసుకుందా? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా.. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని