
విశాఖ ఘటనలో హృదయవిదారక విజువల్స్
విశాఖ: సాగరతీరంలో చల్లటిగాలి పీల్చే ఆ జనం ఒక్కసారిగా విషవాయువు బారిన పడ్డారు. ఓ పరిశ్రమ నుంచి ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్ అవడంతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు కారణంగా అపస్మారక స్థితిలోకి చేరిన తమ చిన్నారులను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రి వైపు పరుగులు పెట్టారు. పచ్చని చెట్లు మాడిపోయాయి. వందలాది మూగజీవాలు నేలకొరిగాయి. ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ భారీ ప్రమాదంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉల్కిపడ్డారు. విషవాయువు కారణంగా ఇప్పటికే 8మంది మృతిచెందగా, మరో 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాద ఘటనకు సంబంధించి హృదయవిదాకరమైన విజువల్స్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.