పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు‌: గౌతమ్‌ రెడ్డి

గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం

Updated : 07 May 2020 15:50 IST

అమరావతి: గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది సాయంతో లీకేజీని నియంత్రించినట్లు చెప్పారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా పరిశ్రమ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో నీటి పిచికారీ ద్వారా గాల్లో గ్యాస్‌ ప్రభావాన్ని నియంత్రించినట్లు వివరించారు. అస్వస్థతకు గురైన వారిని కాపాడేందుకే మొదటి  ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని