కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ బిల్లా అరెస్టు
ఆయుధాల స్మగ్లింగ్లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ బల్జీందర్ సింగ్ అలియాస్ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు...
చండీగఢ్: ఆయుధాల స్మగ్లింగ్లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ బల్జీందర్ సింగ్ అలియాస్ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్పుర్ లోఢి ప్రాంతంలో వీరిని అరెస్టు చేసి భారీయెత్తున అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేకున్నట్టు డీజీపీ దిన్కర్ గుప్త చెప్పారు. బిల్లా...పాకిస్థాన్ నుంచి అత్యాధునిక విదేశీ మారణాయుధాలను అక్రమంగా తీసుకురావడాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫ్రంట్ల అధినేతలతో అతడికి సంబంధాలు ఉన్నాయి. హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించి 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు డ్రమ్ మెషీన్ గన్లు, జర్మనీలో తయారైన మూడు ఎస్ఐజీ సౌవెర్ పిస్టళ్లు ఉన్నాయి. ఇలాంటి పిస్టళ్లను అమెరికా సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఉపయోగిస్తారు. 3 లక్షలకు పైగా ఆస్ట్రేలియన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ, పాకిస్థాన్లలో ఉన్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు బిల్లా అంగీకరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?