గ్యాస్లీక్ బాధితులకు రెండు రోజుల్లో పరిహారం
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పూర్తిగా మూసివేసే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింట్ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రభావం కారణంగా పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలు బియ్యం,..
వెల్లడించిన మంత్రి కన్నబాబు
విశాఖ: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పూర్తిగా మూసివేసే ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింట్ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రభావం కారణంగా పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలు బియ్యం, ఇంట్లో ఉన్న నిత్యావసరాలు ఏవీ వాడకూడదని చెప్పారు. పరిశ్రమ చుట్టుపక్కల బోరుబావులను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రమాద ఘటన పరిసరాల్లో విషవాయువు ప్రభావం వేగంగా తగ్గతోందని.. దీన్ని మరింత తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విషవాయువు ప్రభావం ఉన్న ఐదు గ్రామాల ప్రజలను రేపు సాయంత్రం వరకు వెంకటాపురం వెళ్లకూడదని కన్నబాబు సూచించారు.
ప్రమాద ఘటనపై అంతర్గత కమిటీ వేశామని.. పరిసరాల్లో విషవాయువు ప్రభావం ఎలా ఉండనుందో ఈ కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని కన్నబాబు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత 585 మంది ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం 485 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా బాధితులకు అందించాల్సిన పరిహారాన్ని రెండు రోజుల్లో అందిస్తామన్నారు. చనిపోయిన పశువులకు సైతం రెండు రోజుల్లో పరిహారం అందిస్తామని కన్నబాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో