మరో పరిశ్రమలో గ్యాస్‌ లీకేజ్‌

కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో సోమవారం గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు...

Updated : 11 May 2020 11:58 IST

కాగజ్‌నగర్‌‌: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటన మరవకముందే తెలంగాణ రాష్ట్రంలో అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో సోమవారం గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఉదయం జరిగిన ఈ ఘటనను పరిశ్రమ యాజమాన్యం రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని