విశాఖ గ్యాస్లీక్.. తగ్గని స్టైరీన్ ప్రభావం
విశాఖలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో స్టైరీన్ విషవాయువు ప్రభావం స్థానికులపై ఇంకా చూపిస్తోంది. ఉన్నతాధికారుల భరోసాతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న వారు ఇళ్లను శుభ్రం చేస్తుకుంటున్న క్రమంలో పలు అనారోగ్య
విశాఖ: విశాఖలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో స్టైరీన్ విషవాయువు ప్రభావం స్థానికులపై ఇంకా చూపిస్తోంది. ఉన్నతాధికారుల భరోసాతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న వారు ఇళ్లను శుభ్రం చేస్తుకుంటున్న క్రమంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కంపెనీ పరిసర గ్రామంలో ఇప్పటికీ పలువురు గ్రామస్థులు స్ఫృహ తప్పి పడిపోతున్నారు. వెంకటాపురంలోని కరణం జ్యోతి అనే మహిళ తన ఇల్లు తుడుస్తూ కుప్పకూలిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గోపాలపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటింటి సర్వే చేసే ఆశా కార్యకర్త సైతం విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయింది.
ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో విషవాయువు ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. రెండు లేదు మూడు రోజుల్లో ప్రజలు వారి గ్రామాలకు వెళ్లవచ్చని ఓవైపు మంత్రులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు విషవాయువు గ్రామస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం పలువురు రాష్ట్ర మంత్రులు సైతం గ్యాస్లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లో నిద్రించి పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయా గ్రామాల్లోని ప్రజలు తాజాగా మరోసారి స్ఫృహతప్పి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్