న్యాయవాదులకు నూతన డ్రెస్కోడ్
న్యాయమూర్తులు, న్యాయవాదులను చూడగానే నలుపు రంగు కోట్లు, గౌన్లే గుర్తుకు వస్తాయి.
సిబ్బందిని కోరిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే
దిల్లీ: న్యాయమూర్తులు, న్యాయవాదులను చూడగానే నలుపు రంగు కోట్లు గుర్తుకు వస్తాయి. అయితే వారు ఇప్పుడు వాటికి గుడ్బై చెప్పనున్నారు. దానికి కూడా కరోనా మహమ్మారే కారణం. ఈ నేపథ్యంలో కొత్త డ్రెస్ కోడ్ను త్వరలో వెల్లడిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే బుధవారం ప్రకటించారు. అప్పటి వరకు నల్లని దుస్తులు ధరించవద్దని న్యాయ సిబ్బందికి సూచించారు. ‘ప్రస్తుతానికి నల్ల కోట్లు, గౌన్లు ధరించడం మానుకోండి. వాటికి కరోనా వైరస్ సులభంగా అంటుకుంటుంది’ అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బాబ్డే వ్యాఖ్యానించారు.
వైరస్ వ్యాప్తి కారణంగా చాలా రోజులుగా న్యాయమూర్తులు ఇంట్లోనే ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారిస్తున్నారు. అయితే నిన్నటి నుంచే కోర్టు గదుల్లో కేసుల విచారణ ప్రారంభమైంది. కానీ ప్రతివాదులు ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలో పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు