ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వలస కూలీలు దాదాపు 60 వాహనాల్లో పశ్చిమబెంగాల్‌కు

Updated : 15 May 2020 10:55 IST

అశ్వారావుపేట: వలస కూలీలకు సరిహద్దు కష్టాలు తప్పడం లేదు. ఒక రాష్ట్రంలో అధికారులు అనుమతిచ్చినా మార్గ మధ్యంలో మరో రాష్ట్రం అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి అధికారుల అనుమతితో 2వేల మంది వలస కూలీలు దాదాపు 60 వాహనాల్లో పశ్చిమబెంగాల్‌కు బయలు దేరారు.

వారందరినీ అశ్వారావుపేట సరిహద్దు చెక్కపోస్టు వద్ద ఏపీ సరిహద్దు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వచ్చిన వాహనాలన్నీ సరిహద్దుల్లోనే ఆగిపోయాయి. దీంతో సుమారు 2వేల మంది వలస కూలీలు సరిహద్దుల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9గంటల తర్వాత ఏపీ అధికారులతో చర్చల అనంతరం వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కేవలం ఏపీ రాష్ట్రం దాటే వాహనాలను మాత్రమే అనుమతించారు. ఇతర వాహనాలను సరిహద్దు వద్దే ఆపేశారు. దీంతో ఆ ప్రాంతమంతా వలస కూలీలలతో జనసంద్రంగా మారింది. 



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని