ఏపీలో ఇంటర్‌ పరీక్షల తేదీలు విడుదల

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ని ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ...

Published : 15 May 2020 15:38 IST

అమరావతి: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ని ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. జూన్ 3న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. మార్చి 23న జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని