ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు మరోసారి పెంపు

తెలంగాణలో మరోసారి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, ఎడ్‌ సెట్‌, పీఈ సెట్‌ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఎలాంటి..

Published : 15 May 2020 18:39 IST

వెల్లడించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, ఎడ్‌ సెట్‌, పీఈ సెట్‌ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి ప్రకటనలో పేర్కొంది. గతంలో ఎలాంటి ఆసల్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించిన ఉన్నత విద్యామండలి తాజాగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని