112 మందిని పూడ్చా..రక్షణ కల్పించండి మహాప్రభో!
ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తనకు వ్యక్తిగత రక్షణ తొడుగులు కానీ ఆరోగ్య బీమా కానీ లభించలేదని శ్మశాన వాటిక పర్యవేక్షకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీ: కొవిడ్-19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశరాజధాని దిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఓ శ్మశాన వాటికకు వస్తున్న మృతదేహాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తనకు అందుకు తగినట్టుగా వ్యక్తిగత రక్షణ తొడుగులు కానీ ఆరోగ్య బీమా కానీ లభించలేదని శ్మశాన వాటిక పర్యవేక్షకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలో పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య పనివారు ఇలా అందరికీ ఆరోగ్య బీమా లభించింది... కానీ ఇప్పటి వరకు 112 మంది కరోనా రోగులు, అనుమానితుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించిన తనకు ఆ సదుపాయం లభించలేదని పర్యవేక్షకుడు మొహమ్మద్ షమీమ్ వాపోయారు.
‘‘నేను నిత్యం కరోనా వైరస్తో పోరాడుతున్నాను. లాక్డౌన్ మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. నా తరువాత విధులు నిర్వహించటానికి ఎవరూ సాహసించక పోవటంతో ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి వేళ కూడా ఇక్కడే ఉండిపోతున్నాను. ఇప్పటి వరకు నాకు నాలుగైదు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లు మాత్రమే లభించాయి. మరికొన్ని ఇవ్వాలని ఆరోగ్య శాఖకు విన్నవించినా, ఉన్నవి వైద్యసిబ్బందికే సరిపోవటం లేదని వారు అంటున్నారు. శ్మశాన వాటిక కమిటీ సభ్యులకు ఈ విషయమై ఎన్నిసార్లో విజ్ఞప్తి చేశాను. కానీ లాక్డౌన్ తర్వాత మాత్రమే ఏదైనా చేసేందుకు వీలౌతుందని వారు అంటున్నారు.’’ అని వివరించారు. కాగా, సదరు శ్మశానవాటిక మేనేజింగ్ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ... అంతిమ సంస్కారాల సమయంలో దూరంగా ఉండాల్సిందిగా మొహమ్మద్కు సూచించామని.. అతను తన ఇబ్బంది గురించి తమకు ఏమీ చెప్పలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?