క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సిందే: రైల్వేశాఖ

ప్రత్యేక రైళ్లలో ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్వారంటైన్‌ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

Published : 17 May 2020 20:38 IST

దిల్లీ: ప్రత్యేక రైళ్లలో ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్వారంటైన్‌ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఓ ప్రమాణ పత్రాన్ని పాప్‌ అప్‌గా కూడా ఉంచింది. ఆయా రాష్ట్రాల క్వారంటైన్‌ నిబంధనల్ని అనుసరిస్తామంటూ ప్రమాణ పత్రం ఐకాన్‌ను టిక్‌ చేశాకే టికెట్‌ బుక్‌ చేసుకునేలా ఏర్పాటు చేసింది. ఈ పాప్‌ అప్‌లో ప్రమాణ పత్రం ఐకాన్‌ పక్కన హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తామని ఉంటుంది. ఇటీవల దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో బెంగళూరుకు వచ్చిన 50 మంది ప్రయాణికులు క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరించిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రమాణ పత్రాన్ని ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఉంచింది. బెంగళూరులో క్వారంటైన్‌ను నిరాకరించిన వారిలో 15 మందిని దిల్లీ వెళ్లే రైలుకు ప్రత్యేక బోగీని అమర్చి, డబ్బులు కూడా వారి నుంచే వసూలు చేసి తిప్పి పంపించింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని