కొనసాగుతున్న ‘అంపన్’ తుపాను
పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంపన్ పెను తుపాను కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా...
అమరావతి : పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంపన్ పెను తుపాను కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ఇది ప్రయాణిస్తోందని తెలిపింది. ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ దిశగా 570 కి.మీ, పశ్చిమ్బంగాలోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి రేపు మధ్యాహ్నం బంగాల్-బంగ్లాదేశ్ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే సూచనలు ఉన్నట్టు అధికారులు వివరించారు. తీరం దాటే సమయంలో అత్యంత తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఉప్పాడ తీరంలో అంపన్ ప్రభావం
రేపు తీరం దాటనున్న అంపన్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో ముందే కనిపిస్తోంది. రెండ్రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని బలంగా తాకుతున్నాయి. వీటి ప్రభావానికి రహదారికి రక్షణగా వేసిన రాళ్లు ఎగిరి రోడ్డుపై పడుతున్నాయి. రహదారి ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉబ్బార, మాయపట్నం, సూరాడపేట, కోనపపుపేటలో రాకాసి అలలు గృహాలపై విరుచుకుపడుతున్నాయి. కెరటాల ఉద్ధృతికి పలు గృహాలు నేలకూలడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అప్రమత్తం
శ్రీకాకుళం జిల్లాలోనూ అంపన్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. సముద్రతీర ప్రాంతంలో వాతావరణం చల్లబడింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గొట్టాబ్యారేజీ నుంచి దిగువకు రెండు గేట్ల ద్వారా వంశధార నదిలోకి నీరు విడుదల చేశారు. ఇప్పటికే కోసి ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08942-240557 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి