పెళ్లి డబ్బులతో కూలీల ఆకలి తీర్చి..
కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలంటే ఉండాల్సింది నోట్ల కట్టలు కాదని, పెద్ద మనసని నిరూపించాడు పుణెకు చెందిన ఆటోడ్రైవర్ ఒకరు.
పుణె: కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలంటే ఉండాల్సింది నోట్ల కట్టలు కాదని.. పెద్ద మనసని నిరూపించాడు పుణెకు చెందిన ఓ ఆటోడ్రైవర్. ఈ కరోనా కాలంలో ఘనంగా పెళ్లెందుకని.. ఆకలితో ఉన్నవారి కడుపు నింపి వారి దీవెనలు పొందాలనుకున్నాడు. అందుకే వివాహం కోసం దాచుకున్న సొమ్ముతో వలస కూలీల ఆకలి తీర్చుతున్నాడు. కాబోయే భార్య కూడా అందుకు అండగా నిలిచి వెన్ను తట్టింది.
అక్షయ్ కొతవాలే(30) మహారాష్ట్రలోని పుణెలో ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. మే 25న అతడి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఈలోపే కరోనా కట్టడికోసం కేంద్రం లాక్డౌన్ విధించింది. ఆ దెబ్బతో పని కోల్పోయి వలస కూలీలు ఎంతో మంది రోడ్డున పడ్డారు. సొంతూళ్లకు వెళ్లలేక.. వీధుల వెంట పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూడటం అక్షయ్ కంటపడింది. దీంతో అక్షయ్ మనసు ద్రవించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా పెళ్లి వాయిదా వేసుకున్నాడు. వివాహం కోసం దాచుకున్న రూ.రెండు లక్షలతో వారి కడుపు నింపాలని నిశ్చయించుకున్నాడు. అందుకు కాబోయే భార్య, స్నేహితుల సహకారమూ అందింది. వారి సాయంతో చపాతీలు, కూర చేసి ఒకపూట కూడా తిండికి నోచుకోని వారి ఆకలిని తీర్చాడు. కానీ, అంతలోనే ఓ సమస్య ఎదురైంది. దాచుకున్న డబ్బు అయిపోవచ్చింది. కనీసం మే 31 వరకైనా తన సాయాన్ని కొనసాగించాలని ముందే అనుకున్నాడు. స్నేహితులతో చర్చించి, చపాతీలకు బదులు సాంబారు అన్నం పంచడం మొదలుపెట్టాడు.
ఈ ఒక్కపనితోనే అక్షయ్ ఆగిపోలేదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉన్న వృద్ధులు, గర్భిణులను ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా ఆటోకు లౌడ్ స్పీకర్ పెట్టి.. స్నేహితులతో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాడు. రోడ్డు పక్కన నివసించేవారికి మాస్కులు, శానిటైజర్లను పంచి తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నాడు.
దీనిపై అతడిని కదలించగా..‘ఆటో నడిపి రూ. రెండు లక్షల వరకు దాచుకున్నా. ఇప్పుడు వాటిని వివాహ వేడుకకు వాడటం కన్నా.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి అవసరాలకు ఉపయోగించడమే సరైందని అనిపించింది. నా కాబోయే భార్యతో కలిసి ఓ నిర్ణయం తీసుకొని పెళ్లిని వాయిదా వేసుకున్నా. నేను చేసే పనులకు నా స్నేహితుల సహకారం కూడా ఉంది’ అని అక్షయ్ వెల్లడించాడు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది