ఎన్జీటీకి విచారణాధికారం లేదు: ఎల్జీ పాలిమర్స్
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), రాష్ట్ర హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సహా మొత్తం ఏడు కమిటీలు వేశాయని ఎల్జీ పాలిమర్స్
దిల్లీ: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), రాష్ట్ర హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సహా మొత్తం ఏడు కమిటీలు వేశాయని ఎల్జీ పాలిమర్స్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మే 7న ఘటన జరిగితే... 8న విచారణ కమిటీలు వేశాయని వివరించారు. హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఎన్జీటీకి సుమోటోగా విచారణకు ఆదేశించే అధికారం లేదని ఎల్జీపాలిమర్స్ న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... అవన్నీ అక్కడే తేల్చుకోవాలని సూచించింది. విచారణాధికారంపై ఎన్జీటీలో లేవనెత్తే అవకాశం కల్పించింది. జూన్ 1న హరిత ట్రైబ్యునల్లో విచారణ తరువాత వాదనలు వింటామని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్