ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద గ్రామస్థుల ఆందోళన

విశాఖ జిల్లా ఆర్.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిశ్రమ వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వెంకటాపురం వాసులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఎలాంటి వసతులు అందించడం లేదంటూ ఆందోళన

Updated : 08 Dec 2022 17:49 IST

విశాఖ: విశాఖ జిల్లా ఆర్.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిశ్రమ వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వెంకటాపురం వాసులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ఎలాంటి వసతులు అందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని వదిలిపెట్టి మిగతా గ్రామాలకు వసతులు కల్పిస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న వెంకటాపురం గ్రామవాసులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్టైరీన్‌ విషవాయువు ప్రభావిత గ్రామాల్లో ఆర్.ఆర్‌.వెంకటాపురం కూడా ఉందని.. ఎలాంటి పుకార్లు నమ్మకూడదంటూ పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పడంతో వారు వెనుదిరిగారు. తమ ఆరోగ్యాలపై స్టైరీన్‌ విషవాయువు ప్రభావం ఏవిధంగా ఉండనుందో తెలియదని.. అధికారులు, వైద్యులు సైతం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని పలువురు గ్రామస్థులు వాపోయారు. తమకు పరిహారం ముఖ్యం కాదని.. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడేలా న్యాయం చేయాలని వెంకటాపురం వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

ఎన్జీటీకి విచారణాధికారం లేదు: ఎల్జీ పాలిమర్స్‌

స్టైరీన్‌ లీకేజీ.. విశాఖలో మహా విషాదం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని