మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 2,345 పాజిటివ్ కేసులు రాగా.. 64మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల
ఒక్కరోజే 2345 కేసులు; 64 మరణాలు
ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 2,345 పాజిటివ్ కేసులు రాగా.. 64మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 41,642 నమోదు కాగా.. మరణాల సంఖ్య 1454కి చేరినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.
ధారవిలో కొత్త మరణాల్లేవు!
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1425కి పెరిగాయి. మరోవైపు, గడిచిన 24 గంటల్లో ఈ ప్రాంతంలో కొత్త మరణాలేవీ సంభవించలేదని బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 56మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసుల్లో మాతుంగా లేబర్ క్యాంపులో అత్యధికంగా ఆరు, ముకుంద్నగర్ ప్రాంతంలో ఐదు కేసులు చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు, ముంబయిలోని ధారవిలో కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్)ను మోహరించాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు కేంద్రం సీఏపీఎఫ్ బలగాలను మహారాష్ట్రకు తరలించింది. నిన్న రాత్రి సీఐఎస్ఎఫ్ సిబ్బంది బెండీ బజార్లో కవాతు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ముంబయిలో సోమవారం ఐదు కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు.
బాంబే డయింగ్ రూ.27లక్షల విరాళం
కరోనా కాలంలో అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్న ముంబయి పోలీసులకు వాడియా కుటుంబం చేయూతగా నిలిచింది. తమ బాంబే డయింగ్ సంస్థ తరఫున ముంబయి పోలీస్ ఫౌండేషన్కు రూ. రూ.27లక్షలు విరాళంగా ప్రకటించింది. దీంతో ముంబయి పోలీస్ కమిషనర్ ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తాన్ని పోలీసుల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు