తెలంగాణలో ‘పది’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని విద్యాశాఖ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి

Updated : 22 May 2020 15:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని విద్యాశాఖ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక్కో పరీక్షకు మధ్య 2 రోజుల విరామం ఉండనుందని విద్యాశాఖ ప్రకటించింది. జూన్‌ 8న ఆంగ్లం మొదటి పేపర్‌తో మొదలయ్యే పరీక్షలు 29వ తేదీన సాంఘిక శాస్త్రంతో ముగియనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని