ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలకుగాను ఉద్యోగులకు 90 శాతం
ఏప్రిల్ నెల జీతాలపై ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలకుగాను ఉద్యోగులకు 90 శాతం వేతనాన్ని చెల్లించాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రాబడి లేని కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. ఆర్టీసీ సేవలు పునఃప్రారంభం కావడంతో ఉద్యోగుల విన్నపం మేరకు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ ప్రతాప్ వివరించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బస్సుల్లో భౌతిక దూరం పాటించేందుకు సీట్ల సంఖ్యను సగానికి తగ్గించిన ఆర్టీసీ వివిధ వర్గాల వారికి ఇస్తున్న రాయితీలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొన్ని సడలింపులు చేస్తూ పాత్రికేయులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరిస్తూ ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. పాత్రికేయుల విన్నపం మేరకు రాయితీ కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఎండీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు సహా ఇతరులకు కల్పించే రాయితీలపై విధించిన తాత్కాలిక నిలిపివేత కొనసాగనుందని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు