వలసదారులపై అలా జరగడం ‘పొరపాటు’
దక్షిణ దిల్లీలోని లజ్పత్నగర్లో శుక్రవారం ఓ వలసదారుల బృందంపై.. క్రిమి సంహారక మందును పిచికారీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అది పొరపాటుగా జరిగిందని...
వైరస్ నివారణ రసాయనం వెదజల్లడంపై..
దిల్లీ: దక్షిణ దిల్లీలోని లజ్పత్నగర్లో శుక్రవారం ఓ వలసదారుల బృందంపై.. క్రిమి సంహారక మందును పిచికారీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అది పొరపాటుగా జరిగిందని మున్పిపల్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రసాయనాన్ని పిచికారీ చేసే వ్యక్తి జెట్టింగ్ మెషిన్ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో అలా జరిగిందని చెప్పారు. వెంటనే అధికారులు ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారని తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. లజ్పత్నగర్లోని ఓ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఓ వలసదారుల బృందం.. శ్రామిక్ రైలులో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు స్క్రీనింగ్ పరీక్షల కోసం వేచి ఉంది. అదే సమయంలో పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా, క్రిమి సంహారక మందు వారిపై పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో.. విషయం తెలుసుకున్న దక్షిణ దిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు దానిపై వివరణ ఇచ్చారు.
జనావాసాల మధ్య పాఠశాల ఉండడంతో.. ఆ పాఠశాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రం చేయాలని స్థానికులు కోరినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ సిబ్బంది అక్కడి పరిసరాలను శుభ్రం చేస్తుండగా, జెట్టింగ్ మెషిన్ నుంచి వచ్చే ఒత్తిడి పెరిగి, ఓ పారిశుధ్య కార్మికుడు వలసకూలీలపై పిచికారీ చేశాడని, అది పొరపాటుగా జరిగిందని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న వారికి ఇప్పటికే తగు జాగ్రత్తలు చెప్పామని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న పలువురు అధికారులు వారికి క్షమాపణ చెప్పినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్