చారిత్రక చిహ్నం తొలగింపుపై దుమారం
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని చారిత్రాత్మక చిహ్నం ‘మూడు లాంతర్ల’ను తొలగించడం తీవ్ర దుమారం రేపింది.చారిత్రక చిహ్నం తొలగించడాన్ని..
విజయనగరం: విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని చారిత్రాత్మక చిహ్నం ‘మూడు లాంతర్ల’ను తొలగించడం తీవ్ర దుమారం రేపింది.
చారిత్రక చిహ్నం తొలగించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్గజపతిరాజు ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. గంట స్తంభం, మూడులాంతర్లు, సంగీత కళాశాల ఇందులో ప్రధానమైనవి. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్ల కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నం. ఈ జంక్షన్ వద్ద హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చారిత్ర కట్టడాలు కూల్చివేయడం బాధాకరం. మూడు లాంతర్ల వద్ద స్వాతంత్ర్య సమరయోధులు నిర్మించిన మూడు సింహాల చిహ్నానికి ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వకపోవటం విచారకరం. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న నాయకులే చారిత్రక చిహ్నాల ధ్వంసానికి పాల్పడటం దారుణం. ఈ ఘటనపై ప్రజలు స్పందించాలి. చరిత్రకు, చరిత్ర ఆనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి’’ అని అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు.
వివిధ పార్టీల ఆందోళన...
చారిత్రక చిహ్నం మూడులాంతర్లను తొలగించడంపై వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన, లోక్సత్తా నేతలు మూడు లాంతర్ల కూడలి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. విజయనగరం ఆనవాళ్లు తెలియజేసే కట్టడాలు లేకుండా చేయటం దారుణమన్నారు. అభివృద్ధి పేరిట విధ్వంసం తగదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి