దరఖాస్తు చేసుకుంటే తరలిస్తాం:డీజీపీ
తెలంగాణ నుంచి ఇప్పటివరకు రైళ్ల ద్వారా 1.22 లక్షల వలస కూలీలను వారి రాష్ట్రాలకు తరలించామని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు...
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఇప్పటివరకు రైళ్ల ద్వారా 1.22 లక్షల వలస కూలీలను వారి రాష్ట్రాలకు తరలించామని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ రోజు 40రైళ్ల ద్వారా మరో 50 వేల మంది వలస కూలీలను తరలించినట్లు సీఎస్ చెప్పారు. బిహార్, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇవాళ బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలును సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి తరలించే వలస కూలీలకు రైల్వే శాఖ సమన్వయంతో ఆహారం, నీరు అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వలస కూలీల తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని సీఎస్ వివరించారు.
అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒకే రోజు 40 రైళ్ల ద్వారా 50 వేల మందికి పైగా కూలీలను తరలించినట్లు చెప్పారు. ఆపదనలో ఉన్న వాళ్లందరినీ సొంత రాష్ట్రాలకు పంపించడం సంతోషం కలిగించే విషయమన్నారు. ఇంకెవరైనా సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సౌకర్యం, భద్రత దృష్ట్యా వలస కూలీలను రైళ్లలోనే తరలిస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?